దివంగత పంజాబీ సింగర్, ర్యాపర్ సిద్ధూ మూసేవాలా(Sidhu Moose Wala) ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆయన తల్లి చరణ్ కౌర్(58) ఆదివారం తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. చండీగఢ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఫ్యామిలీ(family) మరో బిడ్డకు(baby) తల్లిదండ్రులు అయ్యారు. ఈ క్రమంలో సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్(60) తన నవజాత కుమారుడిని ఒడిలో పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన సిద్ధూ అభిమానులతోపాటు సన్నిహితులు సోషల్ మీడియా(social media)లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా(Sidhu Moose Wala) మే 29, 2022న మరణించారు. బహిరంగంగా అతనిని కాల్చి చంపారు. ఒక సంవత్సరం తరువాత, సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రుల గురించి వారు త్వరలో కవలలను స్వాగతించబోతున్నారని వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఈ క్రమంలోనే దివంగత గాయని తల్లి చరణ్ కౌర్ తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ తన కొడుకు చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దేవుని ఆశీర్వాదంతో కుటుంబం ఆరోగ్యంగా ఉందని తెలిపారు.
అభిమానులందరి(fans) అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. ఆ ఫోటోలో అతను తన ఒడిలో చిన్నారి ఉన్న చిత్రాన్ని చూపించారు. అందులో అతనితో పాటు సిద్ధూ ఫోటో కూడా ఉంది. సిద్ధూ మరణం తరువాత అతని తల్లిదండ్రులు కుటుంబ వారసత్వం కోసం IVF పద్ధతిలో చిన్నారికి జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: WhatsApp Message: వివాదంగా మారిన మోదీ ప్రభుత్వం వాట్సాప్ మెసేజ్
+ There are no comments
Add yours