Nijam gelavali: చిత్తూరు జిల్లాలో మూడవ రోజు నారా భువనేశ్వరి పర్యటన

చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam gelavali) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. ఉదయం10 గంటలకు చిత్తూరు టౌన్ మురుకుంబట్టు బైపాస్ వద్ద విడిది కేంద్రం నుండి భువనేశ్వరి పర్యటన ప్రారంభమవుతుంది.ఈరోజు మూడు కుటుంబాలను పరామర్శించి, ఆర్ధికసాయం అందించనున్నారు.

భువనేశ్వరి పర్యటన షెడ్యూల్

– 10:45 గంటలకు చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

– 11:45 గంటలకు జీడీ నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండలం, గంగమ్మగుడి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

– 01:15 గంటలకు సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం, తంబూరు గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

– సాయంత్రం 03:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours