Lovers: ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాకు పైకి వెళ్లిన ప్రేమికులు.. రైలు సమీపానికి రాగానే షాకింగ్ ట్విస్ట్.. చివరకు..

అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మరో యువతిపై మనసు పడ్డాడు. ఆమెను కూడా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో చివరకు ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. రైల్వే ట్రాకు వద్దకు వెళ్లగా.. తీరా రైలు సమీపానికి రాగానే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్‌లోని (Rajasthan) బార్మర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పచ్‌పద్ర పోలీస్ స్టేషన్ పరిధి గ్రామానికి చెందిన రాజు భట్ (34) అనే వ్యక్తికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అతడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇటీవల అతడికి రవీన్ అనే 20 ఏళ్ల యువతితో వివాహేతర సంబధం ఏర్పడింది. భార్యకు తెలీకుండా ఆమెను కలుస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజు అప్పటికే వివాహమై, పిల్లలు ఉండడంతో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ విషయంలో కొంత కాలంగా వీరి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

Viral Video: అయ్యో పాపం! స్వీటు బాక్సులు ప్యాక్ చేస్తుండగా.. ఎంత ఘోరం జరిగిందో చూడండి..

ఈ క్రమంలో ఇటీవల రాజు, అతడి ప్రియురాలు కలిసి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతకలేనప్పుడు.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి సమయంలో వారి గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. యశ్వంత్‌పూర్-బార్మర్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చే సమయంలో దూకేందుకు ప్రయత్నించారు. రాజు రైలు కింద దూకగా.. అతడి ప్రియురాలు మాత్రం చివరి నిముషంలో వెనుకడుగు వేసింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రాజును హత్య చేసి అక్కడ పడేశారంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజు ప్రియురాలి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Women: కులాంతర వివాహం చేసుకున్న దంపతులు.. కట్ చేస్తే ఉన్నట్టుండి కారు చోరీ.. చివరకు పోలీసులు విచారించగా..

You May Also Like

More From Author

+ There are no comments

Add yours