Hanu Man: హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన.. మెచ్చుకున్న చిరంజీవి

హైదరాబాద్: అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తెలిపారు. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది. ఈ నెల 22వ తేదీన మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం’’ అని చిరంజీవి తెలిపారు.

అయితే.. రామ మందిర ప్రారంభోత్సం వేళ హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్‌పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నామని హను-మాన్ చిత్ర బృంద నిర్ణయాన్ని ప్రకటించింది. స్వామి కార్యం కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్న హను-మాన్ చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు.

కాగా.. హనుమాన్ మూవీ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో రిలీజ్ కాబోతుంది.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours